నవతెలంగాణ-కంటేశ్వర్ : తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు,శాసన మండలి డిప్యూటీ చైర్మన్, డా: బండా ప్రకాష్ ముదిరాజ్ బి ఆర్ ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి టి ఎస్ ఆర్ టి సి చైర్మెన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ దాధన్న విటల్ పలు కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కు విచేసిన సందర్బంగా ఆర్ అండ్ వి గెస్ట్ హౌస్ లో వారిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చాలతో సన్మానించిన మెతుకు శివ కుమార్ ముదిరాజ్ అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహా సభ మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో జిల్లా ముదిరాజ్ నాయకులు మధు ముదిరాజ్, భూమయ్య ముదిరాజ్, సతీష్ ముదిరాజ్ ,మరియు ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.