సైనికుల్లా పనిచేద్దాం.. కాంగ్రెస్‌ను గెలిపిద్దాం

– మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి
– కాంగ్రెస్‌ నాయకులు మచ్చలేనోళ్లు
– మేడ్చల్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి వజ్రేష్‌ యాదవ్‌
– జంగన్న గెలుపు ఖాయం : ప్రభాకర్‌గౌడ్‌
నవతెలంగాణ-శామీర్‌పేట
తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి వీస్తుందని, అందరూ సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్‌ను గెలిపిద్దా మని మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలిటీ కేంద్రంలో మేడ్చల్‌ నియోజకవర్గ ఏ బ్లాక్‌ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్‌ రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపె ద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ..మల్లారెడ్డి నియోజక వర్గాన్ని అభివద్ధి చేయలేదన్నారు. కార్యకర్తలు ఈ 30 రోజులు కష్టపడితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు.సైనికుల్లా పనిచేసి వజ్రేష్‌ను గెలిపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను బీఆర్‌ఎస్‌ కాఫీ కొట్టిందని విమర్శించారు. అనంతరం వజ్రేష్‌ యాదవ్‌ మా ట్లాడుతూ.. కేసీఆర్‌ హామీలు ఎక్కడా అమలు కా లేదని, దళితులకు డబుల్‌ బెడ్‌ రూం ఇవ్వలేదన్నా రు. సీఎం దత్తత గ్రామం లక్ష్మాపూర్‌ లో రోడ ె్డస్తే అక్కడ కుమ్మరి ఎల్లవ్వ లాంటి వాళ్లు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో డాక్టర్లు లేరన్నారు. మల్లారె డ్డి హాస్పిటల్స్‌ కోసం ప్రభుత్వ దవాఖానాలు నిర్వీ ర్యం చేశారని మండిపడ్డారు. శామీర్‌పేట చెరువు శిఖం భూమి కబ్జా చేసిన మల్లారెడ్డి.. ద మ్ముంటే చర్చకు రావాలన్నారు. నక్క ప్రభాకర్‌ గౌడ్‌ మా ట్లాడుతూ.. జంగన్న గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి సోనియమ్మ రుణం తీర్చు కుందామని పేర్కొన్నారు. అనంతరం మాజీ సర్పంచ్‌ శశికళ, యాదిరెడ్డి, నర్సింహరెడ్డి, యాద వ సంఘం నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో రాములు, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మల్లేష్‌, జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షు రాలు సరిత, జిల్లా యూత్‌ అధ్యక్షుడు శశాంక్‌, మూడు చింతలపల్లి మండల కమిటీ అధ్యక్షుడు నర్సింలు యాదవ్‌, కౌన్సిలర్‌ మధుసూదన్‌రెడ్డి, రాంచందర్‌, మహేందర్‌, మాజీ ఎంపీటీసీ రవీం దర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు.

Spread the love