లారీ డ్రైవర్‌కు గుండెపోటు..

– వెనుక నుంచి కారును ఢీ లారీ డ్రైవర్‌ మృతి
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
లారీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో రోడ్డుపై ఆగి ఉన్న కారును అతివేగంగా ఢకొీట్టాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్‌కు చెందిన నర్సింహులు(49) మంగళవారం ఉదయం ఆరాంఘర్‌ నుంచి కర్నూలు వెళ్తున్నాడు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రధాన రహదారి వద్దకు రాగానే లారీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే తన భార్యకు ఫోన్‌ చేసి తన గుండెలో కొంచెం నొప్పిగా ఉందని చెప్పాడు. అదే సమయంలో అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న కారును ఢకొీట్టాడు. దాంతో లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కారు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love