పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య యత్నం

నవతెలంగాణ – అచ్చంపేట 
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్న సంఘటన అచ్చంపేట మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు స్థానికులు తెలిపిన వివరణ ప్రకారం బల్మూరు మండలం గోదల గ్రామానికి చెందిన సుభాష్ కు అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరి మధ్య కలహాలు రావడంతో భార్య సంసారానికి రావడం లేదు. ప్రస్తుతం రంగాపూర్ లోనే ఉంటుంది. సుభాష్ ఆదివారం రంగాపూర్ కు వచ్చాడు. ఆ సమయంలో ఇంటిదగ్గర భార్య కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన అతన్ని 108 లో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆత్మహత్యయత్నానికి పూర్తి కారణాలు తెలియవలసి ఉంది.
Spread the love