కాంగ్రెస్ పార్టీ ఎస్టి సెల్ మండల అధ్యక్షునిగా మంకిడి ప్రశాంత్

నవతెలంగాణ -తాడ్వాయి : కాంగ్రెస్ పార్టీ ఎస్టి సెల్ మండల అధ్యక్షునిగా మండలంలోని బంధాల గ్రామపంచాయతీలోని నర్సాపూర్(పియల్) గ్రామానికి చెందిన మంకిడి ప్రశాంత్ ను నియమిస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎస్ టి  సెల్ మండల అధ్యక్షులు మంకిడి ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేస్తానని ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా శక్తి వంచన లేకుండా పోరాడుతానని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కృషి చేస్తానన్నారు. మండల ఎస్టి సెల్ అధ్యక్షునిగా ఎన్నికకు సహకరించిన తాడ్వాయి మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్కకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Spread the love