ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య..

నవతెలంగాణ – నాగిరెడ్డి పెట్
కుటుంబ కలహాలతో ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి బంజారా తండాలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలం బంజారా తండా కు చెందిన అరుణ (32) తో తన భర్త అయినటువంటి వినోద్ గత కొన్ని రోజులుగా సంసార విషయంలో గొడవ పడుతూ ఉండేవాడు. శుక్రవారం సాయంత్రం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం తన ఇంట్లో చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. తండ్రి విటల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. మృతురాలికి ముగ్గురు మగ సంతానం ఉన్నట్లు ఎస్సై రాజు వివరించారు.
Spread the love