నవతెలంగాణ – హైదరాబాద్: గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఏఐ సెంటర్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. క్యాంపస్ ప్రారంభించిన అనంతరం సీఎం¸మాట్లాడారు. హైదరాబాద్తో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)దే అని సీఎం పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ కృషిలో 500 పాఠశాలల్లో ఏఐని వినియోగిస్తూ బోధన కొనసాగుతోందన్నారు.