ఘోర రోడ్డు ప్రమాదం..వలస కూలీలు మృతి

నవతెలంగాణ-ఖమ్మం : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి బతుకు దెరువు కోసం ఖమ్మం వచ్చిన వలస కూలీలు రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజు గంజి జిల్లా కుర్మహా గ్రామానికి చెందిన అన్నదమ్ములు హిరాలాల్ , జయరాజ్ ఖమ్మం లో గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ చేస్తూ బతుకు వెళ్లదీస్తున్నారు. బల్లేపల్లి దగ్గరకు రాగానే రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బ ఎక్కి ట్రాక్ పల్టి కొట్టడంతో ట్రక్కులో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు కింద పడిపోయి మృతి చెందారు. అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Spread the love