ముస్లిం సోదరులకు మంత్రి కోమటిరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు

 – కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది 
 నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లా, నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అంకుఠీత దీక్ష, ధార్మిక చింతనలతో ముస్లింలంతా నెల రోజులపాటు దీక్షలు చేపట్టారని అన్నారు.జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించే శక్తిని అల్లా మీకు ప్రసాదించాలని కోరారు. క్రమశిక్షణ, దాతృత్వం,ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం అని అన్నారు. అల్లా దీవెనలు ఎల్లవేళలా ఉండాలని, అందరిని చల్లగా చూడాలని, సుఖసంతోషాలు మీ ఇంట నిత్యం నెలవుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
Spread the love