నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కలిశారు. ఈ నెల 9న సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. తన ఫాంహౌస్కు వచ్చిన మంత్రిని కేసీఆర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకి కూడా మంత్రి ఆహ్వానం అందించనున్నారు.