తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హైదరాబాద్కు రానున్నట్టు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్ తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో వేడుకలను పెద్దఎత్తున ఘనంగా నిర్వహించనున్నామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.