మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

– బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట
బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం మండలంలోని గుడికందు లలో సర్పంచ్ గంగనిగల్ల మల్లయ్య సతీమణి రాజవ్వ ఇటీవల మృతి చెందింది. విషయం తెలు సుకున్న ఎమ్మెల్యే వారి కుటుంబీకులను పరామర్శించి, ఆర్ధిక సహాయం అందజేశారు. రాజవ్వ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే గ్రామానికి చెందిన బంగారు గళ్ల రాజ య్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భోంపల్లి మనోహరరావు, రొట్టె రాజ మౌళి పంతులు, మండల పార్టీ అధ్యక్షులు జీడి పల్లి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, ఎంపీటీసీ కొమ్ము శరత్, మాజీ సర్పంచ్ తోయేటి ఎల్లయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, నాయకులు తొయేటి ఎల్లం, బక్క కనకయ్య, పులిరాజు, గురు వారెడ్డి, బాల్రెడ్డి, నంట పరమేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love