జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుంది: మోడీ

నవతెలంగాణ – ఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా శుక్రవారం ఉధంపూర్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘నాపై విశ్వాసం ఉంచితే 60 ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చాను. జమ్ము కాశ్మీర్‌లో అమ్మలు, అక్కాచెల్లెళ్లకు గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చాను. పేదలు రోజుకు రెండు పూటల ఆహారం కోసం బాధపడకూడదని వాగ్దానం చేశాను. జమ్మూ కాశ్మీర్‌లోని లక్షలాది కుటుంబాలు రాబోయే 5 ఏళ్లపాటు ఉచిత రేషన్ పొందుతాయని వాగ్దానం చేస్తున్నాను’’ అని మోడీ హామీ ఇచ్చారు.

 

 

Spread the love