నవతెలంగాణ – హైదరాబాద్: గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ గొడవల నేపథ్యంలో మోహన్ బాబు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చేరారు. విపరీతమైన ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయన ఎడమ కంటి కింద గాయమయంది. బీపీ, రక్తపోటు కూడా పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా జల్ పల్లి లోని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు.