ఇద్దరు కొడుకులను సంపులో తోసి తల్లి ఆత్మహత్య..!

నవతెలంగాణ – చౌటుప్పల్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన చౌటుప్పల్‌ మల్లికార్జున నగర్‌లో మంగళవారం చోటు చేసుకున్నది. ఇద్దరు కుమారులను సంపులో తోసెసి ఆ తర్వాత తల్లి కూడ ఆత్మహత్య చేసుకున్నది. మృతులు రాజేశ్వరి (28) మృతులు అనిరుధ్‌ (5), హర్షవర్ధన్‌ (3)గా గుర్తించారు. అయితే, ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు మొబైల్‌లో గేమ్‌ ఆడడంతో రూ.8లక్షల వరకు నష్టపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love