రాష్ట్రపతి ముర్మును కలిసిన నరేంద్ర మోడీ…

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ఊపందుకున్నాయి. ఎన్డీయే సభా పక్ష నేత నరేంద్ర మోడీ ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్డీయే మిత్రపక్షాల తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరారు. ఈ సందర్భంగా… మోదీ విజ్ఞప్తికి రాష్ట్రపతి ముర్ము స్పందిస్తూ,ప ప్రభుత్వ ఏర్పాటుకు మోడీని లాంఛనంగా ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మూడోసారి ప్రధాని పీఠం అధిష్ఠించబోతున్న మోడీకి రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love