టాలీవుడ్లో ప్రస్తుతం ఓ క్రేజీ కాంబినేషన్లో నయా సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ కొత్త సినిమా చేస్తున్నారు. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ను జూన్2న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో రక్తం మరకలతో ఉన్న చేయి.. సినిమా కథపై అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. అంతేకాకుండా ‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్బస్టర్ని అందించిన బ్యానర్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో సర్వత్రా భారీ అంచనాలూ ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోస్టర్ తీరు చూస్తుంటే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల న్యూ ఏజ్ సినిమాతో రాబోతున్నారని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర బృందం తెలియజేయనుంది.