
– ప్రత్యర్థి పై 43,744 ఓట్ల తో విజయం
నవతెలంగాణ- దుబ్బాక రూరల్: 2023 సాధారణ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి,ప్రతిపక్ష ఎమ్మెల్యే రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి చెఱకు శ్రీనివాస్ రెడ్డి ల కి ఊహించని ఇచ్చారు. నియోజకవర్గంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పై పోటీ చేసిన ఆ ఇద్దరూ నేతలు పరాజయపాలయ్యారు.ఈ సారి కాంగ్రెస్, బీజేపీ పై బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి 53,707 మెజార్టీ సాధించారు. సమీప అభ్యర్థి అయిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు పై 43,744 ఓట్ల తో విజయ భేరీ మోగించారు. దీంతో దుబ్బాక లో తిరిగి గులాబీ జెండా ఎగురవేశారు.