ప్రజా సమస్యలను వెలికి తీసేవి పత్రికలే

– మాజీ కౌన్సిలర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సునీతా ప్రభాకర్‌ రెడ్డి
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రజలు ఎదురకొంటున్న సమస్యలు వెలికి తీసి అధికారుల దృష్టికి తీసుకెళ్లేవి పత్రికలేనని చందానగర్‌ మాజీ కౌన్సిలర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సునీతా ప్రభాకర్‌ రెడ్డిలు అన్నారు. చందానగర్‌లోని ఆమె నివా సంలో నవతెలంగాణ 2024 న్యూ ఇయర్‌ క్యాలెండర్‌ను కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ప్రజా స్వామ్యంలో పత్రికల పాత్ర చాలా కీలకమని, పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు. పత్రికలు సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోసించాలని సూచించారు. ప్రతీ ఇంట్లో ఉండేది క్యాలెం డర్‌ అని, ముహుర్తాలు, పండుగలను మనకు ముందుగా తెలిపేవి క్యాలెండర్‌ లేనని పార్వతి అన్నారు. ఈ సం దర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు, అధికారులకు కొత్త సంవత్సర శుభాకాం క్షలు తెలిపారు. కార్యక్రమంలో పోచయ్య, ఎండి గౌస్‌, చందర్‌ రావు, పార్వతి, గౌస్‌, శాంత, తన్వీర్‌ బేగం, ఎండి. గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love