నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా వారితో సత్సంబంధాలే ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఇరు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీలో టిక్కెట్లు ఇచ్చిన వారికి పదవులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.