సీఎం జగన్ దంపతులకు నోటీసులు

నవతెలంగాణ – హైదరాబాద్
ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షి దినపత్రికను గ్రామ వాలంటీర్లు కొనుగోలు చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. దీనిని ఢిల్లీ హైకోర్టులో ఉషోదయ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తాజాగా స్వీకరించింది. సీఎం జగన్ దంపతులతో పాటు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్‌కు నోటీసులు పంపింది.
Spread the love