వైభవంగా ఎన్టీఆర్‌ లెజెండరీ నేషనల్‌ అవార్డ్స్‌ వేడుక

ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఎన్‌టీఆర్‌ లెజెండరీ నేషనల్‌ అవార్డ్స్‌ వేడుక ఎల్‌ వీ ప్రసాద్‌ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగింది. 8 రాష్ట్రాలకు చెందిన సినీ, సామాజిక ప్రముఖులకు అందించిన ఈ పురస్కార వేడుకకు మురళీ మోహన్‌, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌, ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ, జెన్‌కో చైర్మన్‌ ప్రభాకరరావు, ఎఫ్‌డిసిచైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం, బసిరెడ్డి, దామోదర్‌ ప్రసాద్‌, కాశీ విశ్వనాథ్‌, ఎన్టీఆర్‌ మనవడు నందమూరి యశ్వంత్‌, గౌతమ్‌ రాజు తదితరులు విచ్చేసి గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేశారు.
ముఖ్య అతిథిగా, అవార్డు గ్రహీతగా విచ్చేసిన మురళీ మోహన్‌ మాట్లాడుతూ,’ జాతీయ స్థాయిలో ఇంతమందిని ఒక వేడుకలో భాగస్వామ్యం చేయడం ఎంతో కష్టసాధ్యం. అయినప్పటికీ యుగపురుషుడు ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ సంస్థలు ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించడం విశేషం’ అని అన్నారు. రెండున్నర గంటల సమయంలో 101 మందికి అవార్డులను అందజేసిన ఈ వేడుక.. వరల్డ్‌ బుక్‌ అఫ్‌ రికార్డులో చోటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన ఎఫ్‌టీపీసి సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా – కార్యదర్శి వీస్‌ వర్మ పాకలపాటి లకు వరల్డ్‌ బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ సిఈఓ రాజీవ్‌ శ్రీవాత్సవ్‌ సర్టిఫికెట్‌ ని ప్రదానం చేశారు.

Spread the love