లారీ ఢీకొని వృద్ధురాలు మృతి

road-accident– తప్పించుకున్న లారీ, గాలిస్తున్న పోలీసులు
నవతెలంగాణ – రాయపర్తి
లారీ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్సై వడ్డె సందీప్ కుమార్ తెలిపిన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన చింతనూరు అండాలు (70)  గురువారం ఉదయం చుట్టాల ఇంటికి వెళ్లడానికి ప్రయాణమై బస్టాండ్ కు వెళ్లే క్రమంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి (రోడ్డు) దాటుతుండగా ఖమ్మం నుండి వరంగల్ వెళుతున్న లారీ వృద్ధురాలిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అని ఉపోద్ఘాటించారు. మృతురాలి చెల్లెలి కొడుకు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ లారీని నిలపకుండా తప్పించుకున్నాడు. దాంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి లారీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
Spread the love