తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు..

నవతెలంగాణ హైదరాబాద్‌: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

  • పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌ కుమార్‌ విపత్తు నిర్వహణశాఖకు బదిలీ అయ్యారు.
  • విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి.
  • వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా
  • ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.ఎస్. శ్రీనివాసరాజు
  • పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిశోర్‌ నియమితులయ్యారు. ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
  •  జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాను నియమించారు. ఆయనకు ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించారు. వీరికి ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులయ్యారు.
  • వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి.
  • నల్గొండ కలెక్టర్‌ ఉన్న ఆర్‌.వి.కర్ణన్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
Spread the love