జూరాలలో కొనసాగుతున్న వరద ప్రవాహం..

నవతెలంగాణ – హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభమైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 7,211 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 139 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు. కాగా ప్రస్తుతం దాదాపు 5 టీఎంసీల నీరు ఉంది. మరికొద్ది రోజుల్లో జలాశయం పూర్తిస్థాయిలో నిండబోతుందని సమాచారం.

Spread the love