ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ చెల్లింపులు

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య త్వరలోనే ‘చిల్లర’ సమస్యలు తీరనున్నాయి. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్ల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు సిద్ధం చేయగా, తొలుత హైదరాబాద్ లో పరిశీలించనుంది. ఆపై రాష్ట్రమంతటా వినియోగంలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే సంస్థ చేతికి 6 వేల ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ మెషీన్లు అందాయి. ప్రస్తుతం దూరప్రాంత రూట్లలోనే ఉండగా, త్వరలో ఇవి పల్లెవెలుగు వంటి గ్రామీణ ప్రాంత బస్సుల్లోనూ ఉపయోగించనున్నారు.

Spread the love