హైదరాబాద్ లో జెఎం ఫైనాన్షియల్ బ్రాంచ్ ప్రారంభం

నవతెలంగాణ హైదరాబాద్: జెఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ తమ పునరుద్ధరించిన హైదరాబాద్ శాఖను ఈరోజు  ప్రారంభించింది. ఈ శాఖను ఈక్విటీ సీనియర్ ఫండ్ మేనేజర్ అసిత్ భండార్కర్, స్ట్రాటజిక్ అలయన్స్ డైరెక్టర్ మనీష్ శర్మ, దక్షిణ జోనల్ హెడ్ జ్యోత్స్నా కులకర్ణి, ఎపి, తెలంగాణ రీజనల్ హెడ్ విజయ్ దినకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ యొక్క అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగం పట్ల  సంస్థ యొక్క నిబద్ధతను సూచిస్తుంది. ‘ముత్యాల నగరం’గా పేరొందిన హైదరాబాద్, తెలంగాణకు టెక్నో- సావీ రాజధానిగా నిలుస్తోంది. విస్తృత శ్రేణి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న ముత్యాల పరిశ్రమతో, నగరం “సైబరాబాద్” వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఉదాహరణగా ఉంది.
ఈ సందర్భంగా జెఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఈక్విటీ సీనియర్ ఫండ్ మేనేజర్ అసిత్ భండార్కర్ మాట్లాడుతూ “అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ యొక్క AUM వృద్ధి 2021 మార్చిలో దాదాపు  ₹66K కోట్ల నుండి ~సెప్టెంబర్, 2023కు  90K కోట్లకు పెరిగింది.  మొత్తం 35 % వృద్ధిని సాధించింది. ఈ నగరం దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద మార్కెట్లలో ఒకటి. ఈ కంపెనీ తాజాగా కొద్ది మంది కొత్త సభ్యులను నియమించుకుంది. హైదరాబాద్‌ మార్కెట్ కు మరింత బలం జోడించటానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంది” అని అన్నారు.

Spread the love