
నవ తెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ భారత్ జాగృతి అధ్వర్యంలో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం వద్ద కవిత చిత్రపటానికి విద్యార్తినులు మహిళా నేతలు జాగృతి నాయకులు పాలాభిషేకం మంగళవారంం నిర్వహించారు. మొదట కేసీఆర్ కామన్ నుండి క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ గా తరలి వచ్చి పాలభిశేకం చేశారు. ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని వారు హర్షం వ్యక్తం చేశారు.. మహిళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడు ముందు ఉంటారని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా విశేషంగా కృషి చేస్తున్న కవిత కి ధన్యవాదాలు తెలిపారు. కవిత పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళల ప్రజా ప్రతినిదులు ముందుకు వచ్చి బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు.. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత గురించి మొదటి నుంచి పోరాడుతున్న కవితకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది యావత్ మహిళా లోకం విజయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు అపర్ణ , సుమన రెడ్డి, విశాలిని రెడ్డి, భారత జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి రావు, నరాల సుధాకర్ , లక్ష్మి నారాయణ, బి ఆర్ ఎస్ యువ నాయకులు చిన్ను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.