నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా పాస్ పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి. రేపు రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పాస్పోర్టు సేవలు పనిచేయవని పాస్ పోర్టు సేవా సమితి తెలిపింది. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయా తేదీల్లో ఉన్న అపాయింట్మెంట్స్ను ఇతర తేదీలకు సర్దుబాటు చేస్తామని వెల్లడించింది.