మాకు ప్రజలే బాస్..

– గెలుపు ఓటములు నిర్ణయించేది ప్రజలే
– కార్పొరేటర్ గా గెలవాలేని వ్యక్తి తో డిబేట్ అవసరమా అని మా నాయకులు ప్రశ్నిస్తున్నారు
– డిబేట్ ఐటి హాబ్ దగ్గర,వైకుంఠదామం దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర పెడితే బాగుండేది
– గుడి దగ్గర పెట్టడం సరికాదు
– గుడి పేరు చెప్పి రాజకీయాలు చేయను
– నేను గుడి కట్టిన బడి కట్టిన
– కుల మతాల మధ్య చిచ్చు పెట్టి గెలవాలని మీరు చూస్తున్నారు
నవతెలంగాణ -కంటేశ్వర్: బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాస్ లు అని, గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలేనని కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తితో డిబేట్ అవసరమా అని తమ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారని డిబేట్ ఐటి ఆఫ్ దగ్గర వైకుంఠ దామం వద్ద ట్యాంక్ బండ్ వద్ద పెడితే బాగుండేదని గుడి దగ్గర పెట్టడం సరికాదని గుడి పేరు చెప్పి రాజకీయాలు చేయనని గుడికి తాను కట్టుబడి ఉన్నానని కుల మతాల మధ్య చిచ్చు పెట్టి గెలవాలని బిజెపి పార్టీ అభ్యర్థి ధనపాల్ సూర్యనారాయణ చూస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అర్బన్ అభ్యర్థి దిగాల గణేష్ గుప్తా ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మేము చేసిన అభివృద్ధి ప్రజల ముందుంచి ఓట్లు అడుగుతున్నాము. నేను చేసిన అభివృద్దే విమర్శకులకు సమాధానం. నాలుగు సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న-ఎపుడు ఇటువంటి రాజకీయాలు చూడలేదు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలి. చేతనైతే అభివృద్ధి చేయాలి -నువ్వేం చేస్తావో చెప్పాలి కానీ అనవసర ఆరోపణలు చేయకూడదు.డిబేట్ లకు అనుమతి లేదని పోలిసులు నోటిసులు ఇచ్చారు అని తెలియజేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలగకూడదని పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టాము. ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పని చేస్తాం. ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆదేశాలతో ప్రజల ఆశీర్వాదం తో 4వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. 2009 ఎం. పి. గా 2014,2018,2023 లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నాను. నాలుగు సార్లు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసాను తప్ప నేను చేసిన అభివృద్ధి గురించి చెప్పాను తప్ప ఎదుటి పార్టీ నాయకుల పేరు కూడా నేను తీయలేదు. బి.జె.పి పార్టీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గత కొద్ది రోజుల నుండి అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అని ప్రతి రోజు సవాల్ చేస్తే నేను కూడా సిద్ధం అని చెప్పిన అని తెలిపారు. ఆయన చర్చ మిని ట్యాంక్ బండ్ దగ్గర, వైకుంఠదామం దగ్గర లేక ఐటి హాబ్ దగ్గర పెడితే మేము చేసిన అభివృద్ధి కూడా ఆయనకు కనిపించేది. గుడి దగ్గర చర్చకు రా అని సవాల్ చేశారు. నేను గుడి కట్టించిన బడి కట్టించిన కానీ నేను గుడి దగ్గర రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. నిన్న రాత్రి పోలీసులు డిబేట్ లకు అనుమతి లేదని శాంతి భద్రతల సమస్యలు వస్తాయని నోటీసులు ఇచ్చారు.నిజామాబాద్ నగరం శాంతి యుతంగా ఉండటమే నా మొదటి కర్తవ్యం పోలీసుల సూచన మేరకు డిబేట్ ని రద్దు చేసి ప్రెస్ మీట్ కి వచ్చాము. 2014 ,2018 ఎన్నికలలో మేము చేసి అభివృద్ధి పనుల డిజైన్ లను కారపత్రాల్లో వేస్తే అవి రంగుల బొమ్మలు అని హేళన చేశారు.ప్రస్తుతం అవి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలందరి కి అందుబాటులో ఉన్న విషయం మీ అందరికి తెలుసు. మేము చేసిన అభివృద్ధి మా ఎన్నికల కరపత్రాలలో ఉంది. మీకు చేతనైతే అభివృద్ధి చేయండి. ఐటి హాబ్ తీసకవచ్చి ఉద్యోగాలు ఇవ్వండి. మినీ ట్యాంక్ బండ్ కట్టండి. ఇంకా ఏదైనా అభివృద్ధి చేయండి కానీ అవగాహన రాహిత్యం తో విమర్శలు చేయకూడదు. నేను ప్రజలకు జవాబుదారిగా ఉంటాను. నన్ను గెలిపించింది వారే ప్రజలే నా బాస్ అని తెలిపారు. నిజామాబాద్ నగరం లో హైదరాబాద్ తరహాలో మినీ ట్యాంక్ బండ్ నిర్మించాము. తెలంగాణ రాష్ట్రం లో ఎక్కడ లేని విధంగా మున్సిపల్ భవనాన్ని నిర్మించాము.హైదరాబాద్ మహా ప్రస్థానం కంటే ధీటుగా వైకుంఠదామలు నిర్మించాము.మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గం.లు మంచి నీరు ఇస్తాము.ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజి కనెక్షన్లు ఉచితంగా ఇస్తాము.గతం లో కుల మతాల మద్య చిచ్చు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూసారు.కానీ రెండు సార్లు మున్సిపల్ కార్పోరేషన్ లో రెండు సార్లు గులాబీ జెండా ఎగురవేశాము.మరొక సారి కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన విదంగా బుద్ధి చెప్పాలి.రాష్ట్రం లో ఒక పార్టీ నిజామాబాద్ నగరం వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంటే గతం లో నిజామాబాద్ నగరం అభివృద్ధి జరగలేదని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి.ప్రజాస్వామ్యం లో స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు మీ అందరికి ఉంది. నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి కోసం, సంక్షేమం కొనసాగింపు కోసం మరొకసారి కారు గుర్తుకి ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ ని గెలిపించాలని ప్రజలందరికీ కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, నుడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్,సూదం రవి చందర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, యెనుగందుల మురళి, ధర్మపురి, అక్బర్ హుస్సేన్, రాజేంద్రప్రసాద్, అంబాదాస్, మాదని శ్రీధర్, అర్ ఎల్ నర్సింహ, గోపరి లక్ష్మణ్, కొవూరి జగన్, గంగమని, కరిపే రాజు,భారీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love