– హైతాబాద్లో పర్యటించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-షాబాద్
గ్రామ సమస్యల పరిష్కారం కోసమే శుభోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధి లోని హైతాబాద్ గ్రామంలో షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్రెడ్డి, సర్పంచ్ మల్లేష్, అధికారులతో కలిసి శుభోదయం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి,ప్రజల సమస్యలు అడిగి తెలుసు కున్నారు. ఆసరా పింఛన్లపై మహిళలను ఆరా తీశారు. మురుగు కాలువ సమస్య ఇబ్బందిగా ఉందనీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా త్వరలో అండర్ డ్రయినేజీ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్రావు, మండల కో ఆప్షన్ సభ్యులు చాంద్పాషా, నాయకులు నరసింహారెడ్డి, రాజు గౌడ్, దర్శన్, శివకుమార్, దేవేందర్రెడ్డి, ఉపసర్పంచ్ గోపాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.