అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

– రెంజల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన బోల్లెల అనిల్ (28) అనుమానస్పద స్థితిలో మృతి చెందగా, అతని నానమ్మ రింకేవార్ నాగు బాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఈ .సాయన్న తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అనిల్ చెల్లెలు, బావ బసవరాజ్ లు తనకు సంబంధించిన మూడు ఎకరాల 20 గుంటల భూమి ని కౌలుకు చేస్తూ ఉండేవాడని, కౌలు డబ్బుల కోసం వెళ్లిన అనిల్ ను చెల్లి బావతో పాటు, సంతోష్ అనే వ్యక్తులు అనిల్ పై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కౌలు డబ్బులతో పాటు తన పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని అనిల్ వారితో గొడవ పడడంతో అతనిని కొట్టినట్లు నానమ్మ పేర్కొంది. తన మనవడి మరణం అనుమానస్పదంగా ఉందని ఆ ముగ్గురు వ్యక్తులే కారణమంటూ ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. మృతుడి నానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తలిపారు.
Spread the love