చంద్రబాబుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ల కొట్టివేత

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌కు సంబంధించి ఒక్కమాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్‌ బేలా త్రివేది హెచ్చరించారు. ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్‌ అని ధర్మాసనం పేర్కొంది. సీఐడీ కేసులు సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బి బాలయ్య పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Spread the love