సీపీకి పూల వర్షంతో వీడ్కోలు పలికిన రాచకొండ కమిషనరేట్ పోలీస్ అధికారులు

నవతెలంగాణ-హైదరాబాద్ : రాచకొండ సీపీ డీసీ చౌహన్‌కు కార్యాలయంలో పూలతో వీడ్కోలు పలికారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే పోలీస్ శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పలువురు కమిషనర్లను డీజీపీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇందులో రాచకొండ సీపీగా పని చేసిన చౌహాన్ ఉన్నారు. అయితే ఆయనకు కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో… ఒక్కో పోలీస్ అధికారి పూల వర్షం కురిపిస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన బయటకు వచ్చి మహిళా పోలీసులతో ఫోటో దిగారు. కాగా, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించారు. చౌహన్ డీజీపీ కార్యాలయంలో రిపార్ట్ చేశారు.

Spread the love