థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

నవతెలంగాణ – సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జ్యోతి థియేటర్ పై ప్రభాస్ అభిమానులు దాడికి పాల్పడ్డారు.సినీ నటుడు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా ప్రారంభించారని థియేటర్ అద్దాలను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఉదయం 7 గంటలకు ప్రారంభించారు థియేటర్ నిర్వాహకులు.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిమానులు థియేటర్ పై దాడికి పాల్పడ్డారు.

Spread the love