పప్పు కుక్కర్ పేలి చిన్నారులకు గాయాలు

– అంగన్వాడీ కేంద్రంలో  చిన్నారులకు గాయాలు…
నవతెలంగాణ – కోదాడరూరల్
పప్పు కుక్కర్ పేలి చిన్నారులకు గాయాలైన సంఘటన అనంతగిరి మండలం శాంతినగర్  అంగన్వాడి కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంగన్వాడి సిబ్బంది పప్పు వండుతుండగా కుక్కర్ హఠాత్తుగా పేలింది. ఈ ఘటనలో చిన్నారులు నీలం అభినవ్,కరిసే తన్సి లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను కోదాడ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్సకు సూర్యాపేట వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న అనంతగిరి తహసిల్దార్ రవికుమార్ సంఘటనకు వెళ్లి పరిశీలించి క్షతగాత్రులను మెరుగైన చికిత్స చేయాలన్నారు.
Spread the love