పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంచిన పంజాబ్‌..

నవతెలంగాణ  – అమృత్‌సర్‌: పంజాబ్‌లో భగవంత్‌సింగ్‌ మాన్‌ నేతృత్వంలోని ఆప్‌ సర్కారు పెట్రోల్‌‌, డీజిల్‌ ధరలపై విలువ ఆధారిత పన్ను (VAT) ను పెంచింది. వ్యాట్‌ పెంపు తర్వాత లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.65 కు, డీజిల్‌ ధర రూ.88.95 కు పెరిగింది. కాగా 2023లో పంజాబ్‌ సర్కారు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంచడం ఇది రెండోసారి. గత ఫిబ్రవరిలో కూడా పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.90 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచింది.

Spread the love