శంషాబాద్‌లో అత్యవసరంగా దిగిన ఖతార్‌ విమానం

నవతెలంగాణ – హైదరాబాద్
శంషాబాద్‌ విమానాశ్రయంలో ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం అత్యవసరంగా దిగింది. ఖతార్‌లోని దోహా నుంచి నాగ్‌పూర్‌ వెళ్తున్న విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. నాగ్‌పూర్‌లో వాతావరణ పరిస్థితులు అనుకలించకపోవడంతో విమానాన్ని హైదరాబాద్‌కు  దారిమళ్లించారు. దీంతో విమానాన్ని శంషాబాద్‌లో దించినట్లు అధికారులు తెలిపారు. విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారని, అంతా క్షేమంగానే ఉన్నారని చెప్పారు. వారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా, తమను గమ్యస్థానానికి కాకుండా మధ్యలోనే దించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముందుగానే చూసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు.

Spread the love