రజకులను రాష్ట్ర ప్రభుత్వం అదుకొవాలి..

నవతెలంగాణ-భిక్కనూర్ : రజక కులస్తులకు ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సహాయం అందజేసి అదుకొవాలని రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, దళితులకు అందిస్తున్న దళిత బంధు తరహాలో రజక బంధు అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు రవి, సాయిలు, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Spread the love