నవతెలంగాణ – హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్బాబు ఈ ఏడాది ఏ సినిమాలోనూ నటించలేదు. సంక్రాంతికి రిలీజైన ‘గుంటూరు కారం’ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో రాజమౌళి రూపొందించే SSMB29 కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మొత్తం ప్రీప్రొడక్షన్ పనులే పూర్తిచేయనుండగా 2025 జనవరిలో సెట్స్పైకి వెళ్లనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కావడంతో భారీ ప్రీవిజువలైజేషన్, వర్క్షాప్స్పై జక్కన్న దృష్టిసారించారు.