నవతెలంగాణ – హైదరాబాద్: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్రతన్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంతిమ సమస్కారాలకు సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు హాజరై నివాళులర్పించారు. రాజీవ్ రతన్ కుటుంబసభ్యులను సీఎం ఓదార్చారు.