రూ.2.11లక్షల కోట్లు కేంద్రానికి మంజూరు చేసిన ఆర్బీఐ

నవతెలంగాణ – ఢిల్లీ : ఆర్థిక సంవత్సరం 2024కి సంబంధించి కేంద్రానికి ఆర్బీఐ రూ.2.11లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ను మంజూరు చేసింది. ఆర్థిక సంవత్సరం 2023కి మంజూరు చేసిన మొత్తం (రూ.87,416 కోట్ల) కంటే 141% ఎక్కువ. దీంతో ద్రవ్యలోటు 0.4% వరకు తగ్గొచ్చనేది విశ్లేషకుల అంచనా. ఈ స్థాయిలో కేంద్రానికి డివిడెండ్ కేటాయించడం ఆర్బీఐ చరిత్రలో ఇదే తొలిసారి. మరోవైపు కంటింజెన్సీ రిస్క్ బఫర్ పేరుతో కేంద్రం కోసం నిర్వహించే ప్రత్యేక నిధి పరిమితిని ఆర్బీఐ 6.5శాతానికి పెంచింది.

Spread the love