ప్రజా పాలనను ఆకస్మిక తనిఖి చేసిన ఆర్డీవో

నవతెలంగాణ-నంగునూరు
ప్రశాంత వాతావరణంలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగించాలని ఆర్డీవో రమేష్‌ బాబు సూచించారు. మండల పరిధిలోని సిద్దన్నపేట గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆర్డీవో రమేష్‌ బాబు ఆకస్మికంగా సందర్శించారు. లబ్ధిదారులు నమోదు చేసుకుంటున్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఎవరూ తొందరపడొద్దని, సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటారని పేర్కొన్నారు. తదుపరి ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఆరు వరకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందిచ్చవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ అనిల్‌ కుమార్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్‌ఎం, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు పలువురు పాల్గొన్నారు.

Spread the love