రేపు మణిపుర్‌లోని 11 కేంద్రాల్లో రీ-పోలింగ్‌

Polingనవతెలంగాణ – హైదరాబాద్
ఈ నెల 19వ తేదీన సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగినా.. హింసాత్మక రాష్ట్రంలో మాత్రం హింస మరోసారి చెలరేగింది. దీంతో ఆ పోలింగ్ను రద్దు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రేపు ఓటింగ్ జరగనుంది. మణిపుర్‌లోని 11 పోలింగ్‌ స్టేషన్‌లలో మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇన్నర్‌ మణిపుర్‌ లోక్‌సభ స్థానంలోని 11 చోట్ల రీ పోలింగ్‌ను సోమవారం రోజున ఓటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 19న ఆయా పోలింగ్‌ బూత్‌ల వద్ద కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం, బూత్ క్యాప్చరింగ్‌ వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికలను చెల్లనివిగా ఈసీ ప్రకటించింది. కాంగ్రెస్‌ మాత్రం ఇన్నర్‌, ఔటర్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 47 పోలింగ్‌ బూత్ క్యాప్చరింగ్‌ జరిగిందని, అన్ని చోట్లా రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్‌ చేసింది.

Spread the love