రెడ్డి కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ – గోవిందరావుపేట
నిధులతో కూడిన రెడ్డి కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించాలని రెడ్డి ఐక్య సంఘాల కార్యాచరణ కమిటీ రెడ్డి మహిళా సంఘం ములుగు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి సంధ్యారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామంలో మరియు కోటగడ్డ గ్రామంలో రెడ్డి ఆత్మీయ సమ్మేళనం గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం మండల ప్రధాన కార్యదర్శి అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. వాల్ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం రెడ్డి సంధ్యారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్యాచరణను ప్రారంభించి మాట నిలబెట్టుకోవాలని అన్నారు. లేనట్లయితే వచ్చే ఎన్నికల్లో మాట తప్పిన వారికి తగిన గుణపాఠం చెబుతామని కూడా అన్నారు. రెడ్డి సంక్షేమం కోసం రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని జూన్ ఒకటో తారీకు మడికొండలో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం పసర గ్రామ కమిటీ అధ్యక్షులు మిర్యాల యాదగిరి రెడ్డి యానాల ధర్మారెడ్డి సామ సమ్మిరెడ్డి సునీత సమ్మక్క మరియు రెండు గ్రామాల కమిటీ సభ్యులు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love