– కదిలిన యంత్రాంగం..మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతులు
నవతెలంగాణ – శంకరపట్నం
నవతెలంగాణలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజ్ ‘శీర్షికతో ప్రచురితమైన వార్తకు స్పందించిన మిషన్ భగీరథ అధికారులు మండల గ్రామీణ నీటి సరఫరా పథకం ఏఈ బి. మొగిలి, డిప్యూటీ ఈఈ ఎంబి ఇంట్రా ఖాజా వశీయోద్దీన్ తో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రలోని కేశవపట్నం గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో తెగిపోయిన పైపులైనుకి కొత్త పైపుని అతికించి మరమ్మత్తులు చేశారు. దీంతో నాలుగు రోజులుగా నిలిచిన నీటి సరఫరా అంతరాయం తొలిగి పోయిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.