నవతెలంగాణ – హైదరాబాద్: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ ఆఖరి మ్యాచ్లో తనకు తానుగా బెంచ్కే పరిమితమయ్యాడు. దీంతో తిరిగి ఫామ్ను అందుకునే దిశగా హిట్మ్యాన్ చర్యలు చేపట్టాడు. దీనిలో భాగంగా ముంబయి జట్టుతో కలిసి వాంఖేడే స్టేడియంలో రంజీ ట్రోఫీ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ సెషన్ తనకు ఉపయోగకరంగా ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది. అయితే, ముంబయి రంజీ జట్టు తరఫున రోహిత్ బరిలోకి దిగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.