అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

నవతెలంగాణ భీంపూర్:  మండలంలోని అర్లి – ఇందూర్ పల్లి మార్గంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు ఒరిగింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ఆదిలాబాద్ నుంచి కరంజి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా బస్సు అదుపు తప్పిందని ప్రయాణీకులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Spread the love