కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆర్‌వీ దేశ్‌పాండే ప్రమాణస్వీకారం

నవతెలంగాణ – బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ సభ్యుడు ఆర్‌వీ దేశ్‌పాండే ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆర్‌వీ దేశ్‌పాండే చేత ప్రమాణస్వీకారం చేయించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ఇవాళ అసెంబ్లీ సమావేశం అవుతున్నది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. దానికిముందు ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించనున్నారు. కాగా, ఈ నెల 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకుగాను 135 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Spread the love