– అభినందించిన మాజీ ఎంఈఓ మద్దిశెట్టి వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-జూలూరుపాడు
జూలూరుపాడు నందు 5వ తరగతి ప్రవేశానికి గురుకుల పరీక్షలలో అత్యధిక సీట్లు సాధించిన 50 మంది సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్దిని, విద్యార్థులను మాజీ ఎంఈఓ మద్దిశెట్టి వెంకటేశ్వర రావు అభినందించారు. సాయి ఎక్సలెంట్ విద్యాలయం నందు ఫిబ్రవరి 11న గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష నందు 50 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రం నందు సాయి ఎక్సలెంట్ విద్యాలయం ప్రతి సంవత్సరం నవోదయ, గురుకులంలో సాయి ఎక్సలెంట్ విద్యాలయం సీట్లు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ శారద దేవి మాట్లాడుతూ మా సంస్థ నందు ప్రతి విద్యార్థికి ప్రత్యేక శిక్షణతో పాటు గ్రామ స్థాయిలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు. కాంపిటీటివ్ ఎగ్జామ్ లో సీట్లు సాధించి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు ఇచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లి దండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2024-25 విద్య సంవత్సరానికి గాను సీబిఎస్ఈ, కేరళ టీచర్స్చే విద్యా బోధన సాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు హుస్సేన్, శివ కుమారి నరసింహారావు, భద్రం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయలు సత్యవతి, నబీన, సరిత, దుర్గ భవాని, కళ్యాణి, స్రవంతి, అనిత, సింధూ, మోహన్, మణిదీప్, శాంతమ్మ, భారతమ్మ, కృష్ణయ్యలు పాల్గొన్నారు.